శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (16:10 IST)

అనుష్క "ఘాటీ" సంగతులేంటి?.. అరుంధతిగా మమతా మోహన్‌ దాస్‌నే అనుకున్నారట!

Anushka Shetty
అరుంధతి ఫేమ్ అనుష్క, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఘాటీ" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలోని అనుష్కకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గంజాయి కథాశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి కొద్ది నెలల క్రితమే అనౌన్స్ మెంట్ చేశారు.

నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ‘ఘాటీ’ సినిమా తెరకెక్కుతోంది. రివేంజ్ స్టోరీతో ఈ సినిమా రూపొందుతోంది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కొనసాగుతోంది. అనుష్క శెట్టికి సంబంధించి కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. 
 
ఇకపోతే.. అనుష్క కెరీర్ లో అరుంధతి చిత్రం ఒక మైల్ స్టోన్ మూవీ. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదట. ముందుగా మరో హీరోయిన్‌ని అనుకున్నారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. యమదొంగ చిత్రంలో నటించిన మమతా మోహన్ దాస్. కొందరి మాటలు విని తాను ఆ చిత్రం నుంచి డ్రాప్ అయ్యానని మమతా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.