1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:27 IST)

అప్నా టైమ్ అయేగా! అంటోన్న సాయితేజ్‌

Sai Dharam Tej
సాయి ధరమ్ తేజ్  మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడుగా చలన చిత్ర రంగ ప్రవేశం చేసాడు. తను వై.వి.ఎస్. చౌదరి "రేయ్" చిత్రంతో చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టి, "పిల్లా నువ్వులేని జీవితం" చిత్రంతో గుర్తింపు పొందాడు. ఆ త‌ర్వాత చిత్ర‌ల‌హ‌రి, సుప్రీమ్ వంటి చిత్రాల్లో బాబాయ్‌ల‌ను ఇమిటేట్ చేస్తూ పాట‌ల్లో కూడా డాన్స్ చేశాడు.
 
లేటెస్ట్‌గా రిప‌బ్లిక్ అనే సినిమాలో న‌టించాడు. స‌మాజంలో పిరిగిపోతున్న కుల వ్య‌వ‌స్థ‌, అవినీతిని ప్ర‌క్షాళ‌న చేసే ఉద్దేశ్యంతో చేసిన ఆ సినిమా విడుద‌ల త‌ర్వాత మంచి పేరు తెచ్చుకుంది. కానీ దాన్ని పూర్తిగా ఆస్వాదించ‌లేక‌పోయాడు. రిలీజ్ కుముందే రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర‌గాయాలై కోమాలోకి వెళ్ళిన ఆయ‌న అభిమానుల ప్రార్థ‌న‌లు, త‌ల్లిదండ్రుల పూజ‌ల వ‌ల్ల బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత కొంత కాలం రెస్ట్ తీసుకుని ఇప్పుడు ఆరోగ్య‌ప‌రంగా ఫిట్‌గా అయ్యారు. ఇక తాను సిద్ధంగా వున్నాన‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. న‌మ్మ‌కం వుండాలి. మ‌న‌పై న‌మ్మ‌కం బ‌లంగా వుండేలా విశ్వసించండి, అప్నా టైమ్ అయేగా! అంటూ ట్వీట్ చేశాడు.
 
తాజాగా ఆయ‌న ఓ కొత్త చిత్రంతో ముందుకు రాబోతున్నాడు. త్వ‌ర‌లో వివ‌రాలు తెలియ‌నున్నాయి.