శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (17:22 IST)

పిల్లల్లో ఉన్న సృజనకు ఓ ఫ్లాట్ ఫాం కల్పించాలనే నాని మూవీ వర్క్స్‌ను స్థాపించా

Suman, Vishwa Karthikeya, Ayushi Patel, Chandra Bose
Suman, Vishwa Karthikeya, Ayushi Patel, Chandra Bose
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.  ఈ క్రమంలో నిన్న రాత్రి ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో సుమన్, నిర్మాత ఏ.ఎం.రత్నం వంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు...
 
నిర్మాత డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ, నేను విద్యా వేత్తగా ఇంజనీరింగ్ కాలేజీలను నిర్వహిస్తున్నాను. పిల్లల్లో ఉన్న ప్యాషన్‌కు ఓ ఫ్లాట్ ఫాం కల్పించాలనే ఉద్దేశంతోనే నాని మూవీ వర్క్స్‌ను స్థాపించాను. నేను ఉన్న, పెరిగిన ఊరుని తెరపై చూపించాలనే కోరిక ఉండేది. రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. అయితే బడ్జెట్ మాత్రం ఎక్కువ అవుతుందని డైరెక్టర్ చెప్పారు. అయినా పర్లేదని ముందుకు వచ్చాం. సినిమాలు వద్దు అన్నవాళ్లు కూడా మా టీజర్, ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ మూవీ తరువాత రమాకాంత్‌కు, అలాంటి కొత్త వాళ్లకి చాలా మంది నిర్మాతలు అవకాశం ఇస్తారు. విశ్వ కార్తికేయ ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. ఆయుషి పటేల్‌కు ఇది మొదటి సినిమా. చూడగానే ఈ పాత్రకు సెట్ అవుతుందని చెప్పాను. కలియుగం పట్టణంలో సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. మార్చి 29న మా చిత్రాన్ని థియేటర్లో అందరూ చూడండి’ అని అన్నారు.
 
ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ, కలియుగం పట్టణంలో టైటిల్ చాలా కొత్తగా ఉంది. చంద్రబోస్ రాసిన కలియుగం కలుషితం అనే పాట బాగుంది. ఆ పాటనే టైటిల్‌గా పెడితే ఇంకా బాగుండేదని అనుకున్నా. కంటెంట్ కొత్తగా ఉంటే ఆడియెన్స్ ఎలాగూ చూస్తారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
సుమన్ మాట్లాడుతూ..* ‘విశ్వ కార్తికేయ తండ్రి రామానుజంతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. విశ్వని చిన్నతనం నుంచీ చూస్తున్నాను. విశ్వను ఎంతో చక్కగా పెంచారు. అతను చాలా మంచి వాడు. పెద్దలంటే చాలా గౌరవం. విశ్వ కార్తికేయకు ఈ సినిమాతో చాలా మంచి పేరు రావాలి. నటనలో అతను ఎంతో శిక్షణ తీసుకున్నాడు. నిర్మాత ఓబుల్ రెడ్డి ఈ సినిమాను తన ఊర్లో తీయడం చాలా గొప్ప విషయం. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ రమాకాంత్ చేశారు. అలా చేయడం మామూలు విషయం కాదు. మాటలు, పాటలు అన్నీ బాగున్నాయి. చంద్రబోస్ వంటి వారు ఈ సినిమాకు పాటలు రాయడం గొప్ప విషయం. టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 29న ఈ చిత్రం రాబోతోంది. అందరూ సినిమాను చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.
 
డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ..* ‘కలియుగం పట్టణంలో అజయ్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. దేవీ ప్రసాద్ వంటి సీనియర్లను డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. నరేన్ రామ చక్కగా నటించాడు. చంద్రబోస్ వంటి వారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయుషి పటేల్ ఎంతో బాగా నటించారు. విశ్వ కార్తికేయ అద్భుతంగా యాక్ట్ చేశాడు. సినిమాలో నటించిన వారందరికీ థాంక్స్. మార్చి 29న మా చిత్రం రాబోతోంది. అందరూ థియటర్లో వీక్షించండి’ అని అన్నారు.
 
విశ్వ కార్తికేయ మాట్లాడుతూ,  మా నిర్మాతల సహకారం వల్లే సినిమా బాగా వచ్చింది. రమాకాంత్ గారు  అద్భుతంగా కథను నెరేట్ చేశారు. నన్ను నమ్మి ఇంత భారీ బడ్జెట్‌తో సినిమాను తీసిన దర్శక, నిర్మాతలకు థాంక్స్అ ని అన్నారు.
 
ఆయుషి పటేల్ మాట్లాడుతూ..* ‘కలియుగం పట్టణంలో సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఈ మూవీలో నాది చాలా ప్రత్యేకమైన పాత్ర. కెరీర్ ప్రారంభంలోనే ఇంత మంచి పాత్ర లభించడం ఆనందంగా ఉంది. అని అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాద మాట్లాడుతూ, చంద్రబోస్ గారు మాకు మంచి సాహిత్యం అందించారు. ఆయన ఇచ్చిన లిరిక్స్ చూసి మేం షాక్ అవుతుండేవాళ్లం. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఆర్ఆర్‌ కోసం స్పెషల్‌గా పని చేశాం అని అన్నారు.