సంబంధిత వార్తలు
- జీఎస్టీ ఎఫెక్ట్ : రాంగోపాల్ వర్మ అరెస్టు తప్పదా?
- కన్నతండ్రి కాదు.. రాక్షసుడు... పిల్లలు బట్టలు మురికి చేస్తున్నారనీ... (వీడియో)
- అరెస్టు చేయించి సెల్లో వేయిస్తాం.. నిత్యానందకు కోర్టు వార్నింగ్
- బంగారం దొంగతనం కేసులో టాలీవుడ్ నటుడు అరెస్టు
- బాయ్ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తున్నా.. ఇప్పట్లో పెళ్లి లేదు : శృతిహాసన్
నేను హీరోయిన్ను... నిన్నే పెళ్లాడుతానంటూ యువకులకు టోకరా
పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన తమిళ నటి కోట్లాది రూపాయలకు పడగలెత్తింది. ఈ వ్యవహారంపై స్పందించిన తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన తమిళ నటి కోట్లాది రూపాయలకు పడగలెత్తింది. ఈ వ్యవహారంపై స్పందించిన తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కోయంబత్తూరు జిల్లా పాపనాయకన్ పాళయం ధనలక్ష్మినగర్కు చెందిన శ్రుతి (21) అనే యువతి తమిళ చిత్ర పరిశ్రమంలో ఒకటిరెండు చిత్రాల్లో నటించి సినీ నటిగా ఉంది. ఈమె పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి విదేశాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, యువకుల వద్ద లక్షల్లో వసూలు చేసి ఉడాయించింది.
ఇలాంటివారిలో సేలం జిల్లా ఎడప్పాడికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాలమురుగన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శృతి బండారం బయటపడింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు.
శ్రుతితోపాటు ఆమె తల్లి చిత్ర, పెంపుడు తండ్రి ప్రసన్న వెంకటేశ్, తమ్ముడు సుభాష్ను కూడా అరెస్టు చేసి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఆమె వద్ద జరిపిన విచారణలో అనేక మంది యువకులను పెళ్లి పేరుతో మోసగించి రూ.కోట్లు గడించినట్లు తెలిసింది.
తర్వాతి కథనం
