1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 మే 2022 (12:33 IST)

బాలీవుడ్ నన్ను భరించలేదు.. అందుకే టైమ్ వేస్ట్ చేసుకోను.. ప్రిన్స్ మహేష్

Mahesh Babu
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేశ్ బాబుకి జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. 
 
రెండేళ్ల విరామం తర్వాత మహేశ్ బాబు కనిపించబోయే సినిమా ఇది. చివరిగా 2020లో విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ నటించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా బాలీవుడ్‌పై టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ నుంచి తనకు ఎక్కువ ఆఫర్లు రాలేదని.. బాలీవుడ్ ప‌రిశ్ర‌మ త‌న‌ని భ‌రించ‌లేద‌ని ప్రిన్స్ తెలిపారు. 
 
తనను భరించలేని పరిశ్రమలో పనిచేయడం ద్వారా తన సమయం వృధా చేసుకోవాలని అనుకోవడం లేదని మహేష్ అన్నారు. టాలీవుడ్‌లోనే తనకున్న మంచి గౌరవం పట్ల హ్యాపీగా వున్నానని ప్రిన్స్ వెల్లడించారు. 
 
కనుక తన పరిశ్రమను విడిచి పెట్టే ఆలోచన లేదని మహేష్ స్పష్టం చేశారు. ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలనే ఎప్పుడూ అనుకుంటానని.. తన కల నెరవేరుతుందని తెలిపారు.