మంగళవారం, 2 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మే 2023 (12:44 IST)

'పుష్ప' చిత్ర యూనిట్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం

bus accident
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప". గతంలో విడుదలైన తొలి భాగం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇపుడు రెండో భాగం తెరకెక్కుతుంది. అయితే, ఆ చిత్రం కోసం పని చేస్తున్న కొందరు ఆర్టిస్టులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. 
 
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా, నార్కట్ పల్లి వద్ద ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సును ఆర్టీసీ బస్సు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ ముగించుకుని వస్తుండగా, ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ మారేడుపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుంది.