శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (17:23 IST)

'మహర్షి' చిత్రం హిట్ కావడం మహేష్‍కు బ్యాడ్ న్యూస్ అంటున్న నిర్మాత.. ఎందుకు?

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "మహర్షి". ఈ చిత్రం మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల్లో పీవీపీ అధినేత వరప్రసాద్ ఒకరు. ఈయన విజయవాడలోని తన సొంత మాల్‍లో 'మహర్షి' చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, 'మహర్షి' చిత్రం సూపర్‌హిట్ కావడం మహేష్‌కు బ్యాడ్ అని చెప్పారు. ఇదే విషయాన్ని మహేష్‌కు కూడా తాను చెప్పినట్టు తెలిపారు. నిజానికి ఈ చిత్రాన్ని తాను వారం రోజుల క్రితమే చూశానని, అప్పుడు మహేశ్ బాబుకు ఫోన్ చేసి మీకు బ్యాడ్ న్యూస్ అనగానే ఎంతో కంగారుపడిపోయారని గుర్తుచేశారు.
 
బ్యాడ్ న్యూస్ అంటున్నారేంటి? అంటూ మహేశ్ బాబు ఒకింత ఆందోళనగానే అడిగారని, అందుకు తాను బదులిస్తూ, ఈ సినిమాను మించిన హిట్ మీరు ఎప్పటికీ కొట్టలేరు, అదే మీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పానని పీవీపీ వివరించారు. మీ కెరీర్‌లో తిరుగులేని బ్లాక్ బస్టర్, ఇది గుడ్‌న్యూస్ అనేసరికి ఆయన రిలీఫ్‌గా ఫీలయ్యారని పీవీపీ చెప్పారు.
 
కాగా, ఈ సినిమా స్టోరీలైన్‌ను మూడేళ్ల కిందటే దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేశ్ బాబుకు చెప్పించానని, కథ నచ్చడంతో తనతోపాటు దిల్ రాజు, అశ్వనీదత్ కూడా ప్రొడ్యూసర్లుగా చేయి కలిపారని, మహేశ్ బాబు కెరీర్‌లో ఇంతకంటే ముచ్చటైన చిత్రం మరొకటి ఉండదని వరప్రసాద్ చెప్పుకొచ్చారు.