1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (14:50 IST)

చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్ భర్త.. ఈడీ నోటీసులతో ఉక్కిరిబిక్కిరి

బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి. ఈమె భర్త రాజ్‌కుంద్రా. బంగారు, వజ్రాల వ్యాపారం చేస్తున్నారు. అయితే, ఈయనపై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కేసు నమోదు చేసిది.. ఆయనకు సమన్లు జారీచేసింది. 
 
2013లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్‌ మిర్చికి సంబంధించిన కేసులో రాజ్ కుంద్రాపై ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజ్ కుంద్రాను విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. రంజీత్ బింద్రా, బాస్టియన్ హాస్పిటాలిటీ అనే సంస్థతో కుంద్రాకు ఉన్న లావాదేవీలను కూడా పరిశీలిస్తోంది. 
 
ఇటీవల వీరిద్దరి మధ్య కొన్ని వ్యాపార లావాదేవీలపై కీలక సమాచారం అందిన క్రమంలో సమన్లు జారీ చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో రాజ్ కుంద్రా స్టేట్మెంట్‌ను రికార్డు చేయాల్సి ఉన్నందున ముంబైలోని విచారణ అధికారుల ఎదుట హాజరు కావాలని నోటిసులిచ్చినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.