మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (14:11 IST)

అఖండకు అరుదైన గౌరవం.. గోవా ఫిలిమ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం..

Balakrishna - Akhanda
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. డిసెంబర్ నెలలో లాక్‌డౌన్ తర్వాత విడుదలైన 'అఖండ' సినిమా బంపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. కరోనా కాలంలో అతి తక్కువ టికెట్ రేట్స్ మీదనే సుమారు 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. తాజాగా అఖండ సినిమాకు అరుదైన గౌరవం దక్కనుంది.  
 
ఇక అసలు విషయానికి వస్తే గోవాలో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. ఈ 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పేరుతో జరగనున్న ఈ ఈవెంట్‌లో మెయిన్ స్ట్రీమ్ మూవీస్ సెక్షన్‌లో బాలయ్య బాబు నటించిన 'అఖండ',, ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి.
 
వీటితో పాటుగా ఫీచర్ ఫిలిం క్యాటగిరిలో ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన 'సినిమా బండి', విద్య సాగర్ తెరకెక్కించిన 'కుదిరం బోస్' వంటి సినిమాలతో పాటుగా అడవి శేష్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'మేజర్' కూడా ప్రదర్శితం కానుంది.