ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 19 జూన్ 2019 (12:02 IST)

రాగమాధురి నల్లపూసల గొలుసు కనబడలేదు.. ఫిర్యాదు చేస్తే.. దాడి జరిగింది..

బుల్లితెర నటి రాగమాధురిపై దాడి జరిగింది. నల్లపూసల గొలుసు కనబడలేదని అనుమానం వ్యక్తం చేస్తూ.. రాగమాధురి ఆమె హెయిర్ డ్రెసర్ జ్యోతికపై ఫిర్యాదు చేయడమే ఈ దాడికి కారణమైంది.


వివరాల్లోకి వెళితే.. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లోని లక్ష్మీపార్వతి నివాసం వద్ద తెలుగు సీరియల్ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రాగమాధురి నల్లపూసల గొలుసు కనిపించకుండా పోయిందని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ విషయమై సెట్‌లోని సభ్యులను ఆమె ఆరా తీసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఈ ఫిర్యాదులో హెయిర్ డ్రెసర్ జ్యోతితో పాటు మరో ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన ఫిర్యాదులో పేర్కొంది రాగ మాధురి
 
ఈ ఫిర్యాదు మేరకు జ్యోతికను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో పోయిన గొలుసు కారులో దొరికిందంటూ సెట్‌లోని వారు ఆ గొలుసును పోలీసులకు అప్పగించి పోలీస్ స్టేషన్ నుంచి జ్యోతికను తీసుకెళ్లారు. 
 
ఈ ఘటనతో ఆగ్రహం చెందిన జ్యోతిక, తన అనుచరులు ఎనిమిది మందితో కలిసి షూటింగ్ జరుగుతున్న ప్రదేశం వద్దకు వెళ్లి రాగమాధురిపై దాడికి పాల్పడింది. దీంతో రాగ మాధురి ఫిర్యాదు మేరకు జ్యోతిక, ఆమె అనుచరులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.