గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (13:55 IST)

కరచాలనాలు వద్దు.. కరోనాపై ఉపాసన, సుమ సూచనలు

కరచాలనాలు మానేస్తేనే కరోనా వ్యాపించదని వైద్యులు చెప్తున్నారు. కరచాలనాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని కోరుతున్నారు. కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అపోలో ఫౌండేషన్ నిర్వాహకురాలు ఉపాసన కొణిదెల తెలిపారు. వీడియో ద్వారా ఆమె కొన్ని జాగ్రత్తలు, సూచనలు చేశారు. 
 
కరోనా వైరస్ వల్ల జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఒళ్లు నొప్పులు వస్తాయని తెలిపారు. ఈ వైరస్‌ను యాంటీ బయాటిక్స్ అంతమొందించలేవని స్పష్టం చేశారు. అందువల్ల డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి మందులు వేసుకోవద్దని సూచించారు.
 
కరోనా నేపథ్యంలో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, వండని మాంసం తినొద్దని ఉపాసన సూచించారు. 'దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే మాస్కు ధరించాలని కోరారు. దగ్గు, తుమ్ము లాంటివి వచ్చే వ్యక్తి నుంచి 3 అడుగుల దూరం ఉండాలని చెప్పారు. వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండాలి, హ్యాండ్ సానిటైజర్‌ను వెంట ఉంచుకోవాలని ఉపాసన కోరారు.
 
అలాగే యాంకర్ సుమ కూడా కరోనా సోకకుండా వుండేందుకు సూచనలు చెప్పారు. జ్వరం, తలనొప్పి, దగ్గు ఉంటే కరోనా వచ్చినట్లు కాదని, ముందు జాగ్రత్తగా పరిశోధనలు చేసుకోవాలన్నారు. భారతీయ సంస్కృతిలో కరోనా వైరస్ అంత త్వరగా వ్యాప్తి చెందే అవకాశం లేదన్నారు. 
 
మనం ఎవరైనా కనిపిస్తే నమస్కారం చేస్తామని, బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కడుక్కుంటామని, అలాగే వంటల్లో పసుపు వాడుతాం అనే విషయన్ని సుమ గుర్తు చేశారు. పరిశుభ్రత పాటిస్తే కరోనా దరిచేరే అవకాశంలేదన్నారు. కరచాలనం వద్దని చెప్పారు.