1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (19:43 IST)

పవన్‌కు ప్లగ్గా..? ప్లస్సా? జగన్‌ సాక్షి టీవీ మైక్‌తో రేణుదేశాయ్..?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయపార్టీల నేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థులను ఎలాగైనా ఓడించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎపిలో మూడవ పార్టీగా కొనసాగుతున్న జనసేన పార్టీని ఏ విధంగానైనా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు వైసిపి నేతలు. కర్నూలు జిల్లాలో ప్రచారం చేస్తున్న పవన్‌కు పోటీగా ఆయన మాజీ భార్య రేణుదేశాయ్‌ను రంగంలోకి దించారు.
 
సాక్షి రిపోర్టర్‌గా రేణుదేశాయ్‌ను నియమించి ఇంటర్వ్యూ తీసేందుకు కర్నూలుకే పంపారు. కర్నూలు జిల్లాలో వైసిపి ప్రభావం ఎలా ఉందో.. జనంపై నమ్మకం ఏ విధంగా ఉందో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. తన మాజీ భర్త పర్యటిస్తున్న ప్రాంతంలో రేణు దేశాయ్‌ను జగన్ రంగంలోకి దింపడంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. 
 
సాక్షి ఛానల్‌లో ఎన్నికల వరకు మాత్రమే రేణు దేశాయ్‌ను జగన్ నియమించుకుని ఉద్యోగం ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. భారీగా జీతం కూడా రేణు దేశాయ్‌కు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి... పవన్ కళ్యాణ్ తన మాజీ భార్య వల్ల వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కోబోతారో..?