సంబంధిత వార్తలు
- మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్కు గాయాలు
- తమిళనాడులో ప్రవహిస్తున్న నోట్ల కట్టలు: ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఇంట్లో కోటి రూపాయలు
- కాలువలో ఇరుక్కుపోయిన ఎవర్ గివెన్.. హమ్మయ్య మళ్ళీ నీటి మీద తేలింది..
- తండ్రి జ్ఞాపకార్థం కారు కొన్న ప్రభాస్!
- మధుమేహానికి టమోటా జ్యూస్తో అడ్డుకట్ట... ఎలా చేయాలి..?
పేడ, బంకమట్టితో తిరుమలకు చేరుకున్న కారు.. ఆ కారులో?
కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి శ్రీవారి దర్శనార్థం సొంత కారులో తిరుమలకు చేరుకున్నారు. కారు మొత్తానికి పేడ, బంకమట్టి పట్టించారు. ఎండ నుంచి ఉపశమనం కోసం ఇలా చేశారని డ్రైవరు చెప్పారు.
నందకం కార్ల పార్కింగ్ వద్ద ఉంచిన వాహనాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. సాధారణంగా కారులోనే ఏసీ ఉంటుంది చల్లదనాన్ని ఇస్తుంది. కానీ కర్ణాటకకు చెందిన భక్తులు మాత్రం కారు నుంచి వచ్చే ఏసీ చల్లదనం కన్నా పాతకాలం నాటి మట్టి ఎంతో శ్రేయస్కరం అని భావించాడు.
దీంతో డ్రైవర్ చేత పేడ, బంకమట్టిని కారుకు పూయించాడు. నందకం అతిథి గృహం వద్ద పార్కు చేసిన కారును ఆసక్తిగా భక్తులు తిలకించారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా కార్లను తిరుపతికి తీసుకురాలేదని భక్తులు అంటున్నారు.
