సంబంధిత వార్తలు
- దేశంలో పెరిగిపోతున్న ఒమిక్రాన్ - ఇప్పటివరకు 1,892 కేసులు
- దేశంలో కరోనా దూకుడు .. కొత్తగా 37 వేల పాజిటివ్ కేసులు
- నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ నుంచి భారతదేశపు మొదటి ఆటో ఇటిఎఫ్ నిప్పన్ ఇండియా నిఫ్టీ ఆటో ఇటిఎఫ్
- భారత్ మార్కెట్లోకి శామ్సంగ్ నుంచి Galaxy Tab A8 మోడల్
- 17 లక్షల ఖాతాలపై కొరడా ఝుళిపించిన వాట్సాప్
బీ అలెర్ట్ : దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది ... డాక్టర్ ఎస్.కె. అరోరా
కోవిడ్ వ్యాక్సినేషన్ టాస్క్ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎస్.కె. అరోరా దేశ ప్రజలకు ఓ హెచ్చరిక చేశారు. దీంతో కోవిడ్ థర్డ్ వేవ్ మొదలైందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన హెచ్చరించారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా నగరాల్లో నమోదవుతున్న కేసుల్లో 75 శాతం మేరకు కేసులు ఒమిక్రాన్ వేరియంట్వే అని వివరించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లడుతూ, గత యేడాది డిసెంబరు తొలి వారంలో ఒమిక్రాన్ వైరస్ను గుర్తించారని, ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోనే ఈ వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. డిసెంబరు తొలివారం నుంచి చివరి వారం వరకు ఈ వైరస్ కేసుల్లో పెరుగుదల 12 శాతం ఉండగా, ఆ తర్వాత ఈ కేసుల్లో పెరుగుదల ఏకంగా 28 శాతానికి పెరిగాయని ఆయన గుర్తుచేశారు. అందువల్ల దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
తర్వాతి కథనం
