సంబంధిత వార్తలు
- నారా లోకేష్ పాదయాత్ర.. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం
- చెత్తపన్ను, విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను.. బాదుడే బాదుడు: నారా లోకేష్ పాదయాత్ర ప్లాన్?
- నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు... కొత్త పద్ధతి అమలు.. రాజీనామా చేస్తారా?
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలి : నారా లోకేశ్
- విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన నారా లోకేశ్
నారా లోకేశ్ జూమ్ మీటింగ్: కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎలా వచ్చారు?
టీడీపీ నేత నారా లోకేశ్ పదో తరగతి విద్యార్థులతో జూమ్లో సమావేశం నిర్వహిస్తుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లోకేశ్ నిర్వహిస్తోన్న ఆ సమావేశంలో ఉన్నట్టుండి ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కనపడ్డారు.
విద్యార్థుల పేరుతో వైసీపీ నేతలు జూమ్ సమావేశంలో ఎంట్రీ ఇవ్వడంతో లోకేశ్ ఫైర్ అయ్యారు. ఇలా జూమ్ మీటింగ్లో ఎందుకొస్తారని ప్రశ్నించారు. అంతేగాకుండా తనతో చర్చించాలంటే నేరుగా రావాలంటూ లోకేశ్ సవాల్ విసిరారు.
వైసీపీ నేతల బెదిరింపులకు భయపడేదేలేదని నారా లోకేష్ చెప్పారు. జూమ్ సమావేశంలోకి కొడాలి నాని, వల్లభనేని వంశీ రావడంతో విద్యార్థులు కూడా షాకయ్యారు. చివరకు నారా లోకేశ్ హెచ్చరించడంతో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆ సమావేశం నుంచి లెఫ్ట్ అయ్యారు.
