95 పరుగులు.. ఫామ్లోకి కుక్ : జడేజా స్మైల్..!
ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. పరుగులు సాధించడంలో నానా తంటాలు పడుతున్న కుక్.. భారత్తో జరుగుతున్న టెస్టులో మెరుగైన రికార్డు ఉన్న కుక్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. భారత్తో ఆదివారం ప్రారంభమైన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో అతడు 95 పరుగులు చేశాడు. 5 పరుగులతో తేడాతో టెస్టుల్లో 26వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
ఫామ్ కోల్పోయి నానా ఇబ్బందులు పడిన కుక్కు ఈ ఇన్నింగ్స్ గొప్ప ఊరటనిచ్చింది. అయితే ఐదు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోవడం బాధనిపించిందని కుక్ పేర్కొన్నాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తానిచ్చిన క్యాచ్ వదిలేసిన భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కుక్ పరోక్షంగా థాంక్స్ చెప్పాడు. అదృష్టవశాత్తు అలా జరిగిందన్నాడు. చివరికి జడేజా బౌలింగ్లో తాను అవుటైన తర్వాతే అతడి మొహంలో నవ్వు చూశానని కుక్ వివరించాడు.