1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2020 (18:15 IST)

కరోనావైరస్ సోకిందన్న భయంతో ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య

కరోనావైరస్ సోకిందని భయంతో ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
 
ఖైరతాబాద్ రాజేంద్ర నగర్ స్ట్రీట్ నెబరు 3లో వృద్ధ దంపతులు వెంకటేశ్వర నాయుడు, భార్య లక్ష్మీ నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పలువురుని కంటతడి పెట్టిస్తోంది.