ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (13:54 IST)

బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు ష్విప్ట్ డిజైర్ కార్లు... ఆంధ్రా సీఎం ఆఫర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ బ్రాహ్మణ యువతకు ష్విఫ్ట్ డిజైర్ కార్లను అందజేయనున్నారు. ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ కార్లను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహుకరించనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగే ఓ కార్యక్రమంలో 30 మంది ష్విఫ్ట్ డిజైర్ కార్లను ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్ల కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో లబ్దిదారుడు 10 శాతం భరించాల్సివుంటుంది. మరో రెండు లక్షల రూపాయల రాయితీని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మిణ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నెలవారీ ఈఎంఐలలో చెల్లించనుంది.