సంబంధిత వార్తలు
- ఈ రాష్ట్రంలో పుట్టడం కంటే పక్క వేరే రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేది.. బ్రదర్ అనిల్
- ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు - యధావిధిగా పాదయాత్రకు ఓకే
- హెల్త్ యూనివర్శిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతాం : సీఎం రమేష్
- ఏపీలో కొత్తగా ఎంఈవో పోస్టుకు పోటీగా ఎంఈవో-2 - భర్తీకి నోటిఫికేషన్
- ఆంధ్రాలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్పై బదిలీ వేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్పై బదిలీ వేటు వేసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ చీఫ్గా కొనసాగుతున్న సునీల్ కుమార్.. వైకాపా రెబెల్ ఎంపీ రఘురామరాజును పోలీసులతో కొట్టించడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే, పలువురు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు కూడా చేశారు.
ఇలా, సునీల్ కుమార్పై అనేక రకాలైన ఆరోపణలు వచ్చినప్పటికీ వైకాపా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో సీఐడీ విభాగంలో అదనపు డీజీ హోదాను కల్పించింది. ఇపుడు ఆయన్ను బదిలీ చేస్తూ, సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలంటూ ఆదేశించింది. అదేసమయంలో సునీల్ కుమార్ స్థానంలో సీఐడీ అదనపు డీజీగా అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
వైకాపా అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల కాలంలో సీఐడీ పేరు, సునీల్ కుమార్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఈ క్రమంలో ఆయన్ను బదిలీ చేయడం అదికూడా సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించడం ఇపుడు రాష్ట్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
