మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (10:12 IST)

మందుబాబులకు గుడ్ న్యూస్: రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు

మందుబాబులకు గుడ్ న్యూస్. ఏపీలో మరో గంటపాటు అదనంగా మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. తద్వారా ఇకపై రిటైల్ షాపుల్లో రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. 
 
గతంలో రిటైల్ షాపుల్లో రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మరో గంటపాటు అదనంగా సమయాన్ని పొడిగించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. విక్రయ ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పెంచినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
మద్యం విషయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఈ మధ్యకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల  రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేసింది సర్కార్. వ్యాట్‌తో పాటు స్పెషల్‌ మార్జిన్‌, అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని క్రమబద్ధీకరించింది.