మంగళవారం, 11 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 8 నవంబరు 2025 (21:26 IST)

సీఎం సార్, రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తామని రూ.7 కోట్లు తీసుకున్నారు: బాబుకి టీడిపి కార్యకర్త వీడియో

Sudhamadhavi
తనకు రైల్వే కోడూరు తెదేపా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని చెప్పి వేమన సతీష్ అనే వ్యక్తి తమ నుంచి రూ. 7 కోట్లు తీసుకున్నాడంటూ తెదేపా కార్యకర్త సుధా మాధవి ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ... ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని చెబితే అతడిని నమ్మి తాతల నాటి ఆస్తిని అంతా అమ్మి రూ. 7 కోట్లు ఇచ్చాము. ఐతే టికెట్ రాకపోగా తమ డబ్బు తిరిగి ఇవ్వమంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు.
 
విషయం చెప్పేందుకు టీడీపి కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తే తమని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరించారు. వారి నుంచి తప్పించుకుని రహస్య జీవితం గడుపుతున్నాం. వేమన సతీష్ నుంచి నాకు, నా పిల్లలకు ప్రాణ హాని వుంది. సీఎం సార్... ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. మాకు న్యాయం చేయండి... అంటూ బోరున విలపించింది సుధా మాధవి.