1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ESL Narasimha's new record as Governor

గవర్నర్‌గా నరసింహన్ సరికొత్త రికార్డు.. ఏంటది?

ESL Narasimhan
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. గత 2009 నుంచి గవర్నర్‌గా ఉన్న ఈయన హయాంలో ఇప్పటికే నాలుగు ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 30వ తేదీన ఐదో ప్రభుత్వం ఏర్పాటుకానుంది. 
 
గత 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ఈఎస్ఎల్ నరసింహన్ నియమితులయ్యారు. ఆ తర్వాత 2010లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ పిమ్మట 2014లో నవ్యాంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుతో ప్రమాణం చేయించారు. 
 
అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత 2018 డిసెంబరు నెలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికా కేసీఆర్ రెండోసారి ప్రమాణం చేయించారు. ఈయనతోనూ నరసింహన్ ప్రమాణం చేయించారు. 
 
ఇపుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డితో ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ఈ నెల 30వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో జగన్‌తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ వైకాపా ప్రభుత్వంతో కలిపి మొత్తం ఐదు ప్రభుత్వాలు గవర్నర్ హయాంలో ఏర్పడినట్టుగా చెప్పొచ్చు. 
తర్వాతి కథనం
జగన్‌ను మరొక సందర్భంలో కలుస్తాను, ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేను: పవన్ కళ్యాణ్