శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (09:15 IST)

రేపు తిరుపతిలో జాబ్‌మేళా

తిరుపతి అర్బన్‌ మండల రెవెన్యూ కార్యాలయం వెనుక ఉన్న టీటీడీసి శిక్షణా కేంద్రంలో బుధవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు.  చిత్తూరు జిల్లాలోని 9 కంపెనీల్లో 620 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్‌మేళా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 
 
ఉద్యోగాల వివరాలు... 
 
- ఫోర్టు మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ బీపీఓలుగా పనిచేసేందుకు ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలతో స్ర్తీ, పురుషులు 18 సంవత్సరాలలోపు వారు హాజరు కావచ్చును.
 
- ముత్తూట్‌ ఫైనాన్స్‌లో జూనియర్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్స్‌గా పని చేసేందుకు ఇంటర్‌, డిగ్రీ అర్హత కలిగిన యువకులు హాజరు కావచ్చును. 
 
- అమర్‌రాజా కంపెనీలో ఆపరేటర్లుగా పనిచేయడానికి ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌, ఐటిఐ డిప్లోమా విద్యార్హత ఉన్న యువకులు హాజరుకావాలి.
 
- విస్‌టెక్‌ కంపెనీలో ఆపరేటర్లగా పనిచేసేందుకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌, ఐటిఐ డిప్లోమా విద్యార్హత ఉన్న యువతీ యువకులు హాజరుకావాలి
 
- కార్బన్‌  కంపెనీలో ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌, ఐటిఐ డిప్లోమా విద్యార్హత ఉన్న యువతీ  యువకులు హాజరు కావాలి
 
- అపోలో ఫార్మసీలో హెల్పర్లు, ఫార్మసిస్టులుగా పనిచేయడానికి ఎస్‌ఎస్‌సి, బి.పార్మసీ, ఎం. ఫార్మసీ , డి.ఫార్మసి విద్యార్థత ఉన్న యువతీ యువకులు హాజరు కావాలి, 
 
- రైజింగ్‌ స్టార్‌ మొబైల్‌ కంపెనీ అసెంబ్లింగ్‌ విభాగంలో పని చేసేందుకు ఎస్‌ఎస్‌సి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న యువతులకు అవకాశం.
 
- ఇండియా బుల్స్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌గా నిచేసేందుకు యువకులు మాత్రమే హాజరు కావాలి
 
- హీరో కంపెనీలో ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఎస్‌ఎస్‌సి, డిగ్రీ అర్హతలు కలిగిన వారు హాజరు కావాలి.
 
ఇంటర్య్వూలకు 18 నుంచి 30 సంవత్సరాల వయస్సున్న యువతీ యవకులు ఆధార్‌కార్డు, సర్టిఫికెట్స్‌, రెండు ఫొటోలతో హాజరు కావాలి. వివరాలకు 9160912690, 9963561755 సెల్‌ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని డీఆర్‌డీఏ పథక సంచాలకు తెలిపారు.