సంబంధిత వార్తలు
- తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనాలు రద్దు
- చిరుతతో ఓ ఆటాడుకున్న గ్రామస్థులు, చిరుతపైకెక్కి చల్చల్ అంటూ...(Video)
- తిరుమలలో చిక్కిన మరో చిరుత... ఇప్పటివరకు మొత్తం 4
- తిరుమల అలిపిరి నడక దారిలో చిరుతలు హల్చల్: ఐరన్ ఫెన్సింగ్ వేయాలని కోర్టులో పిటీషన్
- అలిపిరి బాటలో 300 కెమెరాలు.. 50 కెమెరాల్లో రికార్డైన చిరుతల సంచారం
తిరుమలలో మళ్లీ కనిపించిన చిరుత.. షాకైన టీటీడీ
తిరుమలలో ఇటీవల చిరుతపులుల సంచారం అధికమైన సంగతి తెలిసిందే. చిన్నారిపై చిరుత దాడి జరిగిన తర్వాత, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చిరుతపులుల కదలికలను పర్యవేక్షించడానికి ట్రాప్ కెమెరాలను ఉపయోగించింది. ఇది నాలుగు చిరుతలను పట్టుకోవడానికి సాయపడింది.
అయితే, తాజాగా తిరుమల నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించింది. ఈ చిరుత కెమెరాలో కనిపించింది. ఇది చూసిన ఆలయ సెక్యూరిటీ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చిరుతను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో అదనపు బోనులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
తిరుపతి కొండ ఉన్న శేషాచలం అడవుల్లో 100కు పైగా చిరుతలు ఉన్నాయి. ఫుట్ పాత్ ప్రాంతంలో వీటిలో 10 చిరుతలు సంచరిస్తున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది.
