1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (18:34 IST)

తిరుపతి యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చిరుతపులి.. కేకలు.. పరుగులు

Leopard
తిరుపతి యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చిరుతపులి ప్రవేశించింది. అంతే విద్యార్థులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. తిరుపతి అలిపిరి సమీపంలోని కొండ దిగువన అటవీ జూ సమీపంలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఉంది. ఈ కాలేజీ క్యాంపస్‌లోకి అడవి నుంచి వచ్చిన చిరుతపులి అక్కడి చెట్టుపైకి ఎక్కింది. 
 
యూనివర్శిటీ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండటంతో అడవి నుంచి చిరుతలు తరచూ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ప్రవేశిస్తుంటాయి. దీని నివారణకు యూనివర్సిటీ చుట్టూ 8 అడుగుల ఎత్తులో ప్రహరీ గోడను నిర్మించారు. గత రాత్రి అడవి నుంచి చిరుతపులి అక్కడి చెట్టు ఎక్కి యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ప్రవేశించింది. 
 
ఆపై ఆవరణలో పడి ఉన్న కుక్కను చిరుత చంపేసింది. కుక్క అరుపులు విని వాచ్‌మెన్ వచ్చి కేకలు వేశాడు. వాచ్‌మెన్‌ శబ్దం విని హాస్టల్‌లోని విద్యార్థులు కూడా పరుగున వచ్చారు. చిరుతను చూసి కొందరు విద్యార్థులు కేకలు వేస్తూ పరుగులు తీశారు.ఇంతలో కాంపౌండ్‌లోని చిరుతపులి అక్కడున్న చెట్టుపైకి ఎక్కి బయటకు దూకి పారిపోయింది. 
 
చిరుతపులి రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. తలుపు, కిటికీలకు తాళం వేసి గదిలోకి వుండిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు యూనివర్సిటీకి వచ్చి చిరుతను పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు. అలాగే చిరుతపులులు ఉన్నందున రాత్రి 7 గంటల తర్వాత హాస్టల్ నుంచి ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు