1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Namitha, Special Attraction In AP Elections

"అందరు బాగున్నారా".. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బాలకృష్ణ..?

namitha
భీమిలి ఎన్నికల ప్రచారంలో సినీనటి నమిత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. గ్లామర్ క్వీన్ నమిత గురువారం సాయంత్రం భీమిలిలో గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ అనుభవజ్ఞుడిని ఎన్నుకోవాలని భీమిలి ఓటర్లను ఈ సందర్భంగా నమిత కోరారు. టీడీపీ పొత్తు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ను సానుకూలంగా నడిపించగలదని ఆమె అన్నారు.
 
2020లో బీజేపీలో చేరిన తర్వాత, నమిత పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా మారారు. భీమిలిలో ఎన్డీఏ అభ్యర్థి గంటా కోసం ప్రచారం చేపట్టారు. "అందరు బాగున్నారా" అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించి ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. గంటాను ఎన్నుకోవాలని స్థానిక ఓటర్లను ఆమె కోరారు.
 
"జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బాలకృష్ణ" అంటూ ఆమె తన ప్రసంగాన్ని ముగించారు. నమిత లాంటి గ్లామర్‌ క్వీన్‌ ఉండటంతో గంటా బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చినట్లు సమాచారం.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బీఆర్ఎస్‌కు పెద్ద షాక్- ఆ పార్టీకి బైబై చెప్పేసిన శ్రీకాంత్‌ చారి తల్లి శంకరమ్మ