శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 16 మే 2019 (15:06 IST)

ఆటోలు నడిపితే వచ్చే సంపాదన చాలడంలేదనీ.. అమ్మాయి అందాన్ని ఎరగా వేసి..

ఆటోలు నడిపడం వల్లే సంపాదన సరిపోవడం లేదనీ ముగ్గురు స్నేహితులు ఓ యువతి అందాన్ని ఎరగావేసారు. ఆ కిలాడీ లేడీ ద్వారా లారీ డ్రైవర్లు, ఇతర వాహనచోదకులను దోపిడీ చేస్తూ డబ్బులు సంపాదించసాగారు. చివరకు వారి పాపం పండి పోలీసులకు చిక్కారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా ఆమంచర్ల గ్రామానికి చెందిన మల్లి శ్రీనివాసులు, వీరేశం, మట్యంపాటి అనిల్‌ అనే ముగ్గురు యువకులు మంచి స్నేహితులు. వీరంతా ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. 
 
వీరిలో అనిల్‌కు రమాదేవి అనే యువతి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, తాము నడుపుతున్న ఆటోల వచ్చే సంపాదన సరిపోవడం లేదని భావించిన ఈ ముగ్గురు మిత్రులు.. రమాదేవి అందాన్ని ఎరగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. 
 
తమ ప్లాన్‌లో భాగంగా, సాయంత్రానికి రమాదేవిని బాగా మేకప్ చేయించి ఆటోలో జాతీయ రహదారిపైకి తీసుకెళ్లి ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డుపై నిలబెట్టేవారు. ఆ తర్వాత ఈ ముగ్గురు ఆటోలోనే చెట్ల చాటున నక్కేవారు. 
 
వాహనచోదకులు ఎవరైనా రమాదేవిని చూసి ఆకర్షితులై శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపితే... అతన్ని పక్కకు వెళ్దామని చెప్పి చీకట్లోకి రమాదేవి తీసుకెళ్తుంది. ఆపై అందరూ కలిసి దాడి చేసి, అతని వద్ద ఉండే నగలు, నగదు లాగేసుకుని, ఆటోలో పారిపోయేవారు. ఈ తంతు గత కొన్ని నెలలుగా సాగుతోంది. 
 
ఈ క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన బత్తల శివాజీ అనే లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిఘా పెట్టి, సుందరయ్య కాలనీ దాటిన తర్వాత నిర్జన ప్రదేశంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.