1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (14:51 IST)

క్షమించండి.. అప్పుడు విదేశాల్లో ఉన్నా.. రాలేకపోయా: పవన్

కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను ఒ

కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని.. అందుకే రాలేకపోయానని.. క్షమించాలని బాధిత కుటుంబాలతో అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే పడవ ప్రమాదం జరిగిందన్నారు. విహార యాత్రకు వెళ్తే విషాదం మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రమాద బాధితుల బాధను అందరూ అర్థం చేసుకోవాలని.. ఎవరినీ నిందించేందుకు తాను రాలేదని పవన్ అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కాస్త ఊరట నిచ్చేందుకే తాను ఇక్కడి వచ్చానని చెప్పుకొచ్చారు.

పడవ ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని, వారికి ప్రభుత్వం అండగా ఉండాలని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నష్టపరిహారం ఇచ్చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ పవన్ కల్యాణ్ నిలదీశారు.