1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. reverse tendering process start from today

నేడు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం

andhra pradesh
పోలవరం ప్రధాన డ్యాం నుంచి ఎడమ కాలువ అనుసంధాన పనులకు ఆరు గుత్తేదారు సంస్థలు పోటీపడుతున్నాయి. ఆ సంస్థల నుంచి టెండరు బిడ్లు దాఖలయ్యాయి. రూ. 274.55 కోట్ల ఐబీఎం విలువతో జలవనరుల శాఖ టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈఎండీకి సంబంధించిన బ్యాంకు గ్యారంటీలు, డీడీల వివరాలను సరిచూసుకుని ఈ సంస్థలు రివర్స్ టెండర్లలో పాల్గొనవచ్చని జలవనరులశాఖ నిర్ణయానికి వచ్చింది. 
 
పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్, మ్యాక్స్ ఇన్​ఫ్రా లిమిటెడ్, ఆప్కాన్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆర్​ఆర్​సీఐఐపీఎల్, డబ్యూసీపీఎల్ సంయుక్త భాగస్వామ్యం, మేఘ ఇంజినీరింగా లిమిటెడ్, ఎంఆర్​కేఆర్ ఎస్​ఎల్​ఆర్ సంయుక్త భాగస్వామ్యంతో మెుత్తం 6 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత రివర్స్ టెండర్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. 
About Writer
ఎం
తర్వాతి కథనం
చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌కు తీవ్ర అస్వస్థత?