సంబంధిత వార్తలు
- అందరికీ అందుబాటులో మద్యం, మాదకద్రవ్య విమోచన కేంద్రాలు
- ఆంధ్రాలో కొనసాగుతున్న వైరస్ వ్యాప్తి .. మరో 33 కొత్త కేసులు
- నిమ్మగడ్డ అంశంలో నో కాంప్రమైజ్? సుప్రీంలో వైకాపా సర్కారు అప్పీల్!
- కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం.. ఏపీ పోలీస్ సేవలు ప్రశంసనీయం
- వ్యక్తులు కాదు.. రాజ్యాంగ సంస్థలే శాశ్వతం : హైకోర్టు తీర్పుపై రమేష్ కుమార్
శ్రీకాకుళంలో పిడుగుపాటుకు నలుగురి దుర్మరణం
శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని వంగర మండలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, సీతంపేట మండలంలో ఒకరు చనిపోయారు. వంగర మండలంలోని మరణించిన వారిలో అచ్యుతరావు అనే పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నారు.
నిజానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో సూర్యతాపం తారాస్థాయిలోవున్నది. భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. అయితే, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఫలితంగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో పిడుగులు పడడంతో నలుగురు మరణించారు.
మృతుల్లో అచ్యుతరావు అనే పదో తరగతి విద్యార్థి, మరో ముగ్గురు పశువుల కాపరులు ఉన్నారు. వీరంతా పశువులు మేపడానికి వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. పైగా, మృతులంతా నిరుపేదలని ప్రభుత్వమే వీరిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
