1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (16:37 IST)

ఎంపీ RRRకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ.. ఆ కాపీ వుందా? అంటూ ప్రశ్న

supreme court
రిషికొండలో కట్టడాల నిర్మాణాలపై సుప్రీం కోర్టు ఏపీకి షాకిచ్చింది. రిషికొండ ప‌రిధిలో ఉన్న రిసార్ట్‌ను పూర్తిగా కూల్చేసిన ఏపీ ప్ర‌భుత్వం అక్క‌డే దానిని మ‌రింత‌గా విస్త‌రిస్తూ కొత్త రిసార్ట్‌ను క‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌నుల వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ తింటోంద‌ని వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు జాతీయ హ‌రిత ట్రైబ్యూన‌ల్‌ను ఆశ్ర‌యించ‌గా... ప‌నులు నిలిపివేయాలంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఎన్జీటీ ఆదేశాల‌ను ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. ఏపీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు.. ఎన్జీటీ ప‌రిధిపై విస్మ‌యం వ్య‌క్తం చేసింది. 
 
రిషికొండ‌లో కొత్త నిర్మాణాలు కూడ‌ద‌ని చెప్పిన సుప్రీంకోర్టు... పాత నిర్మాణాల‌కు అభ్యంత‌రం లేద‌ని తెలిపింది. ఈ మేర‌కు జ‌స్టిస్ గ‌వాయ్‌, జ‌స్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం తీర్పు చెప్పింది.
 
రిషికొండలో కొత్త‌గా ఏర్పాటు చేస్తున్న రిసార్ట్‌కు సంబంధించి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు బుధ‌వారం ఏపీ ప్ర‌భుత్వానికి కీల‌క ఆదేశాలు జారీ చేసింది. రిషికొండ రిసార్ట్ విస్త‌ర‌ణ‌కు అనుమ‌తి లేద‌ని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు... పాత రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేప‌ట్టాల‌ని ఆదేశించింది
 
అదే స‌మ‌యంలో ఎన్జీటీ జారీ చేసిన తీర్పు కాపీ ఉందా? అంటూ ఏపీ ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయవాదిని ప్ర‌శ్నించింది. అందుకోసం స‌మ‌యం కావాల‌ని ఏపీ త‌ర‌ఫు న్యాయవాది కోరడంతో విచార‌ణ‌ను బుధ‌వారానికి వాయిదా వేసింది.