శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (10:31 IST)

వార్తలకెక్కిన తారాచౌదరి.. పామూరు ఎస్ఐతో పెట్టుకుంది...

తారాచౌదరి. ఈ పేరు తెలియని వారుండరు. ఒకపుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పలువురు పెద్ద రాజకీయ నేతలకు, బడా పారిశ్రామికవేత్తలకు, సినీ సెలెబ్రిటీకు అమ్మాయిలను సరఫరా చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో తారాచౌదరి పేరు మీడియాలో మార్మోగిపోయింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగిపోయింది. దీంతో ఆమె పేరు కూడా మీడియాలో ఎక్కడా వినిపించలేదు.
 
ఈ నేపథ్యంలో తాజాగా తారాచౌదరి పేరు వార్తలకెక్కింది. దీనికి కారణం... తన భర్తను పామూరు ఎస్ఐ అకారణంగా కొట్టారంటూ ఆమె మీడియా ముందుకు వచ్చింది. నిత్యావసర సరుకులు, ఐదు నెలల తన బిడ్డకు మందులు తీసుకువచ్చేందుకు ఉదయం 8 గంటల సమయంలో బయటకు వెళ్లిన తన భర్త రాజ్‌కుమార్‌ను పామూరు ఎస్ఐ చంద్రశేఖర్ అకారణంగా కొట్టి నాటుసారా అక్రమ రవాణా కేసును పెట్టారని ఆరోపించింది. 
 
ఈ విషయాన్ని ప్రశ్నిస్తే తనను కూడా బొక్కలో వేస్తానని బెదిరించాడని వాపోయింది. తన భర్త రాజ్‌కుమార్‌పై పామూరు ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ కావాలనే కక్ష పూరితంగా దాడి చేశారని, టార్గెట్ చేసి నాటు సారా తరలిస్తున్నట్లు, తాగినట్లు బ్రీతింగ్ టెస్ట్ సీన్ క్రియెట్ చేసి కేసు నమోదు చేశాడని ఆమె ఆరోపించింది. 
 
లాక్‌డౌన్ సమయంలో తన సమస్యలు, ప్రజల ఇబ్బందులు ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లటమే దీని అంతటికి కారణమన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని కావాలనే తన భర్త రాజ్ కుమార్ బయట తిరుగుతున్న క్రమంలో టార్గెట్ చేసి కేసు పెట్టారని తారా చౌదరి ఆరోపించారు. దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తారా చౌదరి వెల్లడించింది.