1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YSRCP Challa Bhageerath Reddy Died

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత..

bhageeratha reddy
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన భగీరథ బుధవారం చికిత్స ఫలించక కన్నుమూశారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు వైకాపా ధ్రువీకరించింది. 
 
చల్లా భగీరథ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 46 ఏళ్ల వయసుకే ఆయన ఈ లోకాన్ని విడవడం పట్ల వైసీపీ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. 
 
భగీరథ రెడ్డి అంత్యక్రియలు రేపు (నవంబరు 3) కర్నూలు జిల్లా అవుకులో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. చల్లా భగీరథ రెడ్డి దివంగత వైసీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు కావడం గమనార్హం. 
తర్వాతి కథనం
మెక్సికోలో ఘోరం.. మనిషి తలను నోట కరుచుకుని వీధికుక్క ఏం చేసిందంటే?