గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (11:16 IST)

విశాఖ నగరవాసులకు శుభవార్త.. జూన్ 8 నుంచి క్రూజ్ సర్వీస్

Cruise liners
Cruise liners
విశాఖ నగరవాసులకు శుభవార్త. ఎంతో కాలంగా ఊరిస్తున్న క్రూజ్‌ సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఎంప్రెస్‌ అనే నౌక విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి తిరిగి విశాఖకు వస్తుంది. ఈ క్రూయిజ్‌ నౌకకు అనుమతులిచ్చినట్టు విశాఖ నౌకాశ్రయం చైర్మన్‌ కే రామమోహనరావు వెల్లడించారు. టికెట్ల విక్రయాలతో నౌకాశ్రయానికి సంబంధం లేదని తెలిపారు.
 
ఈ నౌకా విహార సర్వీసు నిర్వహణపై నౌకాశ్రయ అధికారులు, జేఎం బక్షీ సంస్థ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చేనెల 8న సర్వీసు మొదలవుతుంది. తర్వాత 15, 22 తేదీల్లో కూడా విహారయాత్రలుంటాయి. ఇంటీరియర్‌ స్టాండర్డ్‌ రూం, ఓషన్‌ వ్యూ స్టాండర్డ్‌ రూం, మినీ సూట్‌ రూం పేరిట నాలుగు విభాగాలు నౌకలో ఉన్నాయి.
 
ఒక్కో విభాగానికి ఒక్కో ధర ఉంటుంది. ఈ నౌకలో అబ్బురపరిచే పలు వసతులు, రెస్టారెంట్లు, క్యాసినో అందుబాటులో ఉంటాయి. ఈ క్రూజ్ నౌక 1,500 నుంచి 1,800 మందితో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగివుంటుంది.