శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (10:30 IST)

మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పేలుతున్న జోకులు, మీమ్స్

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. 8 రోజుల్లో 80 పైసలు గరిష్టంగా పెరిగిన ఇంధన ధరలు బుధవారం సెంచరీ కొట్టాయి. దేశ రాజధాని డిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100.21కు చేరుకుంది. మొత్తంగా లీటరు పెట్రోల్‌పై రూ.4.80 వరకు ధర పెరిగింది. పెట్రోల్‌తో పాటు డీజిల్ రేట్లు కూడా భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో లీటరు డీజిల్ రేటు రూ.90.77 నుంచి రూ.91.47 పెరిగింది.
 
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిల్లో ధరలు మండుతున్నాయి. హైదరాబాద్‌లో అయితే ఏకంగా లీటరు పెట్రోల్ ధర రూ.113.61, లీటరు డీజిల్ ధర రూ.99.84కు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంపై నెటిజన్లు చేస్తోన్న జోకులు సోషల్ మీడియాలో పేలుతున్నాయి.
 
కోహ్లి కంటే ముందే పెట్రోల్ సెంచరీ కొట్టిందంటూ ఒక యూజర్ ట్వీట్ చేశాడు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం సామాన్యుని చెంపలు వాయిస్తుందంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు. ఇలా ఇంధన ధరలపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ పేలుతున్నాయి.