సంబంధిత వార్తలు
- మన గురించి పుకార్లు రాస్తే దమ్ము ఎవరికుంది: బాలయ్య (video)
- రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తరలించిన మంత్రి కేటీఆర్
- బాలకృష్ణతో గీతా ఆర్ట్స్ చిత్రం త్వరలో ప్రారంభం?
- నేను తొందరపడి నిర్ణయాలు తీసుకోనుః బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- బాలయ్య 'అన్ స్టాపబుల్' షో.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వస్తారా?
రూ.2 వేల నోటు ముద్రణ నిలిపివేసిన ఆర్బీఐ
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన మరో పెద్ద నోటు రూ.2 వేల నోటు. ఈ నోటును ఇపుడు ముద్రించండం లేదని భారత రిజర్వు బ్యాంకు తెలిపింది. ముఖ్యంగా గడిచిన రెండేళ్లలో ఈ నోటు ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ పై విధంగా సమాధానమిచ్చింది.
గత 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు కొత్తగా 2వ వేల నోట్లు ప్రింట్ చేయడం లేదు. కొంతకాలంగా రూ.2 వేల నోటు చాలమణిలో కనిపించడం లేదు. ఏటీఎంలలో కూడా రూ.500, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. మార్కెట్లో రూ.2 వేల నోటు కనిపించడమే అరుదైపోయిందని పలువురు దకాణాదారులు చెబుతున్నారు.
మరోవైపు, రూ.2 వేల నోటు ముద్రించక పోవడానికి కేంద్రం గతంలో లోక్సభలో వివరణ కూడా ఇచ్చింది. పెద్ద నోట్ల ముద్రణ ఆపేయడం ద్వారా నల్లధనాన్ని అరికట్టవచ్చని, నకిలీ నోట్ల బెడద నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది.
