1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. Today CBSE 10th Class Results to be announced

నేడు సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు..

CBSE
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. అయితే, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం (నేడు) వెలువడనున్నాయి. 
 
మంగళవారం సాయంత్రం ఈ ఫలితాలను ప్రకటించే అవకాశముందని పలు మీడియాలు పేర్కొంటున్నాయి. అయితే.. పదో తరగతి ఫలితాలపై సీబీఎస్ఈ, కేంద్ర విద్యాశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 
 
కానీ అంతకుముందు బోర్డు చెప్పిన వివరాల ప్రకారం ఈ రోజు ఫలితాలు వెల్లడయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో సాయంత్రం నాటికి ఫలితాలు విడుదల అవుతాయని భావిస్తున్నారు. అయితే.. బోర్డు నుంచి అధికారిక ప్రకటన లేనప్పటికీ, విద్యార్థులు తమ 10వ తరగతి ఫలితాలు ఎలా ఉంటాయో చూసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మెడ నొప్పి, కీళ్ళ నొప్పులున్నాయా? డెల్టా ఏమో... త‌స్మాత్ జాగ్ర‌త్త‌!!