1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Media bulletin on Covid Positive Cases in Andhra Pradesh

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ పాజిటివ్ కేసులు

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. గత రెండు రోజులుగా ఈ కేసుల పెరుగుదలలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. మంగళవారం విడుదల చేసిన ప్రకటన మేరకు 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు పది వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో 4,1713 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. ఇందులో 10,057 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో అత్యధికంగా విశాఖపట్టణం జిల్లాలో 1,827 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, చిత్తూరులో 1,822 కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇకపోతే, ఈ కరోనా వైరస్ సోకి 8 మంది చనిపోగా, మరో 1,222 మంది కోలుకున్నారు. అలాగే, తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,27,441కు చేరగా, వీరిలో 20,67,984 మంది కోలుకున్నారు. అలాగే, 14522 మంది చనిపోయారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పగలు సైకిల్ పైన‌... రాత్రి ఫ్యాన్ కిందకు ... మంగ‌ళ‌గిరిలో లోకేష్ ప్ర‌క్షాళ‌న‌