శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (09:10 IST)

తెలంగాణ గవర్నర్‌కు అజారుద్దీన్ ఆహ్వానం.. ఎందుకు?

azharuddin
తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ కొనసాగుతున్నారు. ఆమెను భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కలుసుకుని ఒక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 25వ తేదీ హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టీ20 క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఆహ్వానించారు. 
 
మంగళవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ మొహాలీలో జరుగుతుంది. రెండో మ్యాచ్ 23వ తేదీన, మూడో మ్యాచ్ 25వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు గవర్నర్‌ను అజారుద్దీన్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆమెకు అజారుద్దీన్ స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలిసి మ్యాచ్‌కు రావాలంటూ ఆహ్వానించారు. 
 
ఈ విషయాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా, 3 టీ20 మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌ మూడో మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం సభ్యులతో కలిసి తనను కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అహ్వానించారని చెప్పారు.