1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Record breaking response to India- Pak match in OTT history

భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. OTT ప్లాట్‌ఫారమ్‌లో రికార్డు..

indo - pakistan
వరల్డ్ కప్ మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తాజాగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రికార్డ్ సాధించింది. ఈ మ్యాచ్‌ను శనివారం ఎంతో ఆసక్తిగా తిలకించారు.. క్రికెట్ ఫ్యాన్స్. ఈ మ్యాచ్‌ను ఆఫ్‌లైన్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు.
 
ప్రేక్షకులు OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్ స్టార్‌లో ఏకకాలంలో 35 మిలియన్లకు పైగా చూశారు.
 
అంటే మూడున్నర కోట్ల మందికి పైగా వీక్షకులు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించారు. దీంతో వరల్డ్ వైడ్ OTT చరిత్రలో ఏ క్రీడకూ రాని భారీ రెస్పాన్స్ వస్తోంది. మొత్తానికి భారత్-పాక్‌ల మధ్య అసలైన మ్యాచ్‌నే అతిపెద్ద పోటీ అని మరోసారి రుజువైంది. ICC ODI ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత్ హ్యాట్రిక్ కొట్టింది. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తిరుగులేని విజయం సాధించింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వన్డే ప్రపంచ కప్ : శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్