1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జనవరి 2024 (13:02 IST)

అబార్షన్ చేయించుకునేందుకు నిరాకరించిన యువతి... స్క్రూడ్రైవరుతో కిరాతకంగా పొడిచిన యువకుడు ..

victim
తన వల్ల గర్భం దాల్చిన యువతి అబార్షన్ చేయించుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆ యువకుడుకి ఎక్కడలేని కోపం వచ్చింద. వెంటనే స్క్రూ డ్రైవరుతో ఆ బాలికను పొడిచి బ్లేడుతో గొంతు కోశాడు. ఈ ఘటన ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
స్థానికంగా ఉండే ఓ ఆయుర్వేద క్లినిక్‌లో పని చేస్తున్న ఓ యువతి గురువారం చిల్లా గ్రామంలోని ఫైర్ బ్రిగేడ్ కార్యాలయం సమీపంలో రక్తపు మడుగులో పడివుంది. దీన్ని గమనించిన వాహనదారులు ఆ బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి వెంటిలేటర్‌‍పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
దాడి తర్వాత ఆమె మృతి చెంది ఉంటుందని భావించిన నిందితుడు ఆమెను ఎవరూ గుర్తు పట్టకుండా బండరాయితో ముఖంపై మోది పారిపోయాడు. నిందితుడిని యోగేశ్ ధేడాగా గుర్తించి అరెస్టు చేశారు. 19 యేళ్ళ వయసు కలిగిన యోగేశ్... ఆ యువతి గత మూడేళ్ళుగా రిలేషన్‌‍లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న యువకుడు.. అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.