సంబంధిత వార్తలు
- పేర్లు - రంగులు మార్చడం సీఎం జగన్కు ఉన్న జబ్బేమో : చంద్రబాబు సెటైర్లు
- ఈ నెల 13న శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల
- అరండల్ పేటలో బోరుగడ్డ అనిల్ కుమార్ క్యాంపు ఆఫీసుకు నిప్పు
- సినిమా ఇండస్ట్రీకి చెడు చేయను : ఎఫ్ డిసి నూతన ఛైర్మన్ పోసాని మురళి కృష్ణ
- తిరుమలలో లడ్డూల తయారీ కోసం రూ.50 కోట్లతో యంత్రం
తిరుమలలోని హోటల్ మరుగుదొడ్డిలో మహిళకు ఆత్మహత్య
తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా ఉన్న ఒక హోటల్ మరుగుదొడ్డిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని విజయవాడకు చెందిన సుమతిగా గుర్తించారు. ఈమె తిరుమలలో ఒక హోటల్లో పని చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా ఉన్న మరుగుదొడ్డి నుంచి భారీగా పొగలు రావడంతో అక్కుడున్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరుగుదొడ్డి తలుపులు పగులగొట్టి చూశారు. అందులో ఒక మహిళ మంటల్లో దహనమవుతూ కనిపించింది. ఆమెను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అప్పటికే ఆమె శరీరం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆదివారం రాత్రి గంటల సమయంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, మృతురాలిని విజయవాడకు చెందిన సుమతి (53) అనే మహిళగా గుర్తించగా, తిరుపతిలోని ఓ హోటల్లో పని చేస్తున్నట్టుగా నిర్ధారించారు.
