గురువారం, 22 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2015 (16:07 IST)

బర్డ్‌కు రూ. కోటి విరాళం... టీటీడీ ఈవోకు అందజేసిన పారిశ్రామికవేత్త

ఎంతోమంది వికలాంగులకు నడకను ప్రసాదిస్తున్న బర్డ్ సంస్థకు రూ. కోటి విరాళంగా లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఈ విరాళాన్ని ఇచ్చారు. 
 
తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త ఆనందప్రసాద్‌ రూ.కోటి విరాళం అందజేశారు.మంగళవారం తిరుమలలో రూ.కోటి చెక్కును తితిదే ఈవో సాంబశివరావుకు అందజేశారు. 
 
ఈ నిధులను బాలాజీ వికలాంగుల శస్త్ర చికిత్సశాల ట్రస్టుకు జమ చేయాలని ఈ సందర్బంగా ఆనంద ప్రసాద్‌ తితిదే ఈవోను కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున చేసే సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని దాత అన్నారు.