శ్రీవారిని దర్శించుకున్న ఉడిపి స్వామి
ఉడిపిలో అడ్మార్ మఠ పీఠాధిపతి విశ్వప్రియ తీర్థ స్వామి బుధవారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దగ్గరుండి సాంప్రదాయాల ప్రకారం మర్యాదలు చేశారు.
ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆయనకు అధికారులు, అర్చకులు దగ్గరుండి స్వాగతం పలికి స్వామి దర్శనానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కార్ సెల్వం తదితరులు పాల్గొన్నారు.