గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (20:56 IST)

ఆమెకి 41 ఏళ్లు... కుమార్తెల బోయ్ ఫ్రెండ్స్‌తో 21 సార్లు శృంగారం...

ఇలాంటి సంఘటనలు ఈమధ్య కాలంలో వెలుగుచూస్తున్నాయి. కాలం తెస్తున్న మార్పులు కారణంగానో లేక మరేమిటో కానీ పెళ్లయి పెళ్లీడుకు వచ్చిన పిల్లలున్నప్పటికీ టీనేజ్ వయసున్న కుర్రాళ్లతో కొందరు మహిళలు కామకలాపాలు సాగిస్తున్న వార్తలు వెలికివస్తున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా కాలిఫోర్నియాలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే... అమెరికాలోని కాలిఫోర్నియాలోని విసేలియా ఏరియాలో లైటిల్ అనే 41 ఏళ్ల మహిళ, తన భర్తతోపాటు ఇద్దరు కూతుళ్లతో వుంటోంది. అమ్మాయిలు పెళ్లీడుకు వచ్చారు. వీరిద్దరికీ చెరో బోయ్ ఫ్రెండ్ వున్నారు. వారిని ఆమె కుమార్తెలు తన తల్లికి పరిచయం చేశారు. అంతే... ఆమె వారిపై కన్నేసింది. తనలో రగులుతున్న కోర్కెలను వారితో తీర్చుకోవాలని నిర్ణయించుకుని వారికి మాయమాటలు చెప్పి లొంగదీసుకుంది. వాళ్లిద్దర్నీ కారులో ఎక్కించుకుని గెస్ట్ హౌసుకి తీసుకెళ్లి అక్కడ వారికి మద్యం, సిగరెట్లు ఇచ్చి వారితో 21 సార్లు శృంగారం చేసింది. 
 
ఐతే అక్కడితే ఆగకుండా తనతో రోజూ శృంగారం చేయాల్సింది బలవంతం చేయసాగింది. దానితో ఈ విషయాన్ని ఓ కుర్రాడు లైటిల్ భర్త దృష్టికి తీసుకెళ్లాడు. విషయం తెలిసిన భర్త ఆ కుర్రాళ్లను ఏమీ అనలేదు. దాంతో అతడి మంచితనాన్ని గ్రహించిన యువకులు లైటిల్ ఒత్తిడి చేసినా శృంగారానికి ససేమిరా అన్నారు. ఐనప్పటికీ ఆమె వదలకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. టీనేజ్ యువకులను బలవంత పెట్టి శృంగారం చేసినందుకు ఆమెకి ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు. మరోవైపు ఆమె భర్త ఆమెకి విడాకులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు.