శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (17:31 IST)

రన్ల వర్షంలో ధోనీ- రైనా.. ముద్దుల వర్షంలో కుమార్తెలు (video)

ఓవైపు ఐపీఎల్ మ్యాచ్‌లో తమ తండ్రులు పరుగుల వర్షం కురిపిస్తుంటే.. వారి కుమార్తెలిద్దరూ ముద్దుల వర్షంలో తడిసి ముద్దయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ, ''చిన్నతల'' రైనాలు సహ క్రికెటర్లే కాకుండా మంచి స్నేహితులు కూడా. మైదానంలో ఇద్దరు తమ స్నేహాన్ని పలుమార్లు ప్రదర్శించుకుంటూ వుంటారు. 
 
రైనా-ధోనీల స్నేహం సుదీర్ఘమైనది. వీరిద్దరి తరహాలోనే కెప్టెన్ ధోనీ కుమార్తె జీవా, రైనా కుమార్తె క్రేజియాలు కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు. తాజాగా చెన్నై-ఢిల్లీల మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. ఇంకా ఏం జరిగిందంటే.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ ముగిసిన తర్వాత జీవా ధోనీ, క్రేసియా రైనాలు కలిశారు. 
 
ఆ సమయంలో ఒకరికరు ముద్దెట్టుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంకా #bestie అనే హ్యాష్ ట్యాగ్‌తో రైనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అలాగే #Reunited అంటూ జీవా ధోనీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోను యాడ్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.