శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (12:44 IST)

ఐపీఎల్ 2020... చెన్నై-ముంబైల మధ్య తొలి మ్యాచ్.. వ్యూవర్ షిప్ అదిరిపొద్ది..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ధోనీ, రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఐపీఎల్‌ను అత్యధికులు వీక్షించనున్నారని.. ఐపీఎల్ ఛైర్మన్ ప్రిజేష్ పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
యూఏఈ నుంచి ప్రిజేష్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా అనేక అడ్డంకులను దాటుకుని ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుందన్నారు. ఈ సిరీస్‌ సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. అత్యధిక మంది వీక్షకులు ఈ షోను తిలకించనున్నారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్సుకు కరోనా కాలంలో ఐపీఎల్ 13వ సీజన్ మంచి వినోదాన్ని పంచనుందన్నారు. 
 
బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకుల కఠోర శ్రమతో ఈ సీజన్ జరగనుందని.. కరోనా వైరస్ కారణంగా ఈ షో జరుగుతుందా లేదా అనే అనుమానం తలెత్తిందని చెప్పుకొచ్చారు.  కరోనాపై పోరాటం చేస్తూనే ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
 
ఇకపోతే.. ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు అబుదాబి, దుబాయ్, షార్జాల్లో జరుగనున్నాయి. దుబాయ్‌లో 24 మ్యాచ్‌లు, అబుదాబిలో 20 మ్యాచ్‌లు, షార్జాలో 12 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రతీ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. రెండు మ్యాచ్‍లు జరిగేటప్పుడు తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.