శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: మంగళవారం, 28 మే 2019 (19:31 IST)

వేలానికి ప్రపంచంలోనే అతి భయంకరమైన ల్యాప్‌టాప్...

చారిత్రక ప్రాశస్త్యం కలిగిన, అరుదైన, అపురూపమైన వస్తువులు, పాతకాలం నాటి కళాఖండాలను వేలం వేయడం చాలానే చూసుంటాం. కానీ వీటన్నింటికి భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ల్యాప్‌టాప్‌గా పేరొందిన ఓ వస్తువు వేలానికి వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు, కంపెనీలకు 95 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చేకూర్చిన ఆరు ప్రమాదకర వైరస్‌లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉండటంతో దీనికి ఆ పేరువచ్చింది. నిర్వాహకులు దీన్ని వేలం వేయగా 1.3 మిలియన్‌ డాలర్లు పలికింది.
 
ఈ ల్యాప్‌టాప్‌లో ప్రపంచాన్ని గడగడలాడించిన ‘వాన్నాక్రై’, ‘ఐ లవ్‌ యూ’, ‘డార్క్‌ ఎనర్జీ’, ‘సో బిగ్‌’, ‘మైడూమ్‌’, ‘డార్క్‌టెక్విలా’ వైరస్‌లు, రాన్సమ్‌వేర్‌లు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన వైరస్‌లతో కూడిన ల్యాప్‌టాప్‌ను గ్యూ ఓ డాంగ్‌ అనే ఇంటర్నెట్‌ ఆర్టిస్ట్‌ రూపొందించాడు. 
 
వైరస్‌లపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఇలాంటివి భౌతికంగా మనపై దాడి చేస్తాయని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ల్యాప్‌టాప్‌ నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకున్నామని దీన్ని కేవలం విద్యా ప్రయోజనాల కోసమే వినియోగించాలని నిర్వాహకులు తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.