1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. igebra.ai introduces math++ Dots learning program focusing on Math, Data, and AI Thinking for 1st to 4th graders

ఒకటి నుంచి 4వ తరగతి గ్రేడర్ల కోసం మ్యాథ్స్- ఐజిబ్రా డాట్‌ ఏఐ

igebra
యుఎస్‌ కేంద్రంగా కలిగిన ఎడ్‌ టెక్‌ స్టార్టప్‌ (igebra.ai) నూతన తరపు వినూత్నమైన కార్యక్రమం మ్యాథ్‌++ను విడుదల చేసింది. ఇది మ్యాథ్స్‌ మరియు డాటా మరియు ఏఐ థింకింగ్‌ సమ్మేళనంగా ఉండటం వల్ల అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్‌ ప్రపంచంలో  డిమాండ్‌ను విద్యార్థులు అందుకోగలరు. ఈ సృజనాత్మక కార్యక్రమాన్ని భారతదేశంతో పాటుగా పలు దేశాలలో ఆవిష్కరించారు. భారతదేశంలో మ్యాథ్‌++ డాట్స్‌ ప్రోగ్రామ్‌ ధర 4999 రూపాయలు. దీనిని igebra.aiలో కొనుగోలు చేయవచ్చు.

 
ఏఐ మరియు డాటాలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం కలిగిన సోషల్‌ విజనరీలు రూపకల్పన చేసిన మ్యాథ్‌++ డాట్స్‌ ప్రోగ్రామ్‌లో మూడు కీలకాంశాలు భాగంగా ఉంటాయి. అవి మ్యాథ్‌,  రోబార్ట్‌ మరియు ఎక్స్‌ప్రెస్‌ స్మార్ట్‌.

 
ఐజిబ్రా డాట్‌ ఏఐ ఫౌండర్‌ అండ్‌ సీఈవో శ్రీని వేముల మాట్లాడుతూ, ‘‘సహజసిద్ధమైన అభ్యాస కార్యక్రమం మ్యాథ్‌++. నేటి డిజిటల్‌ ప్రపంచం కోసం అవసరమైన థియరిటికల్‌ పరిజ్ఞానంతో తీర్చిదిద్దడం వల్ల ఇంటరాక్టివ్‌ మరియు శక్తివంతంగా మారుస్తుంది. విద్యార్థులు అత్యుత్తంగా నేర్చుకునేందుకు ఇది సహాయపడటంతో పాటుగా వినోదమూ అందిస్తుంది’’ అని అన్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ప్రభుత్వ ఉద్యోగం పిచ్చి, మహిళతో ట్రాప్ చేసిన ఫ్రెండ్, హోటల్ గదికెళ్లిన అతడికి...?