1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్

రిలయన్స్ జియో నుంచి న్యూ ఇయర్ ఆఫర్స్

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో ఇపుడు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తమ సంస్థ వినియోగదారులకు అనేక ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా, రోజుకు 1.5జీబీ డేటా, ఇతర సదుపాయాలతో కూడిన 336 రోజుల ప్లాన్ వ్యాలిడిటీని 29 రోజులకు పెంచి 365 రోజులు చేసింది. 
 
అంటే, జియో వినియోగదారులు ఒక యేడాది ప్లాన్ కింద రూ.2,545కు రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ వర్తిస్తుంది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.5 జీబీ హై స్పీడ్ డేటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, జియో ఫ్లాట్‌ఫామ్‌పై ఇతర సదుపాయాలు పొందవచ్చు. ఈ ప్లాన్ పాత యూజర్లకే కాకుండా కొత్త కనెక్షన్ పొందిన వినియోగదారులకు కూడా వర్తిస్తుంది. 
 
అలాగే 365 రోజుల వ్యాలిడిటీతో మరో ప్లాన్‌కు జియో అందుబాటులోకి తెచ్చింది. రూ.2,879 రీచార్జ్‌పై 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీపీ డేటాను పొందవచ్చు. ఇందులోనూ రోజు వంద ఎస్ఎంఎస్‌లు, ఇతర సదుపాయాలు పొందవచ్చు. 
 
అలాగే 20 శాతం జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద రూ.719, రూ.666, రూ.299 రీచార్జ్ ప్లాన్లను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ల కింద రీచార్జ్ చేసుకునేవారు జియోమార్ట్‌పై చెల్లింపులకు ఉపయోగపడే క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు.